Monday, April 29, 2024

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five dead 18 injured after private bus hit another vehicle

కనౌజ్: ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని సౌరిఖ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా…. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బీహార్ దర్బంగా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

 

Five dead 18 injured after private bus hit another vehicle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News