- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. ఇండియాలో కోవిడ్-19 కేేసులు 14లక్షలు దాటాయి. గడిచిన 24గంటల్లో 708 మరణాలు, అత్యధికంగా 49,931 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 14,35,453కి చేరాయి. వీటిలో 4,85,114 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 9,17,568 మంది కరోనా బాధితులు నయమయ్యారు. దేశవ్యాప్తంగా 32,771మంది కరోనాతో మృతి చెందినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్ లో ఒకేరోజు 5.15 లక్షల కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎమ్ఆర్ పేర్కొంది. దేశంలో ఇప్పటిదాకా 1.68 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు.
708 deaths and 49931 Covid 19 cases reported in india
- Advertisement -