- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ 32 లక్షలను దాటాయి. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కోవిడ్-19 కేసులు, 1,059 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,34,475కు పెరిగింది. దేశవ్యాప్తంగా 7,07,267 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు ఈ వైరస్ నుంచి 24,67,759 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో కరోనా మృతులు 59,449కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. కాగా, భారత్ లో మంగళవారం వరకు మొత్తం 3,76,51,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. నిన్న ఒక్కరోజులోనే 8,23,992 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
India COVID 19 cases tally crosses 32 lakh mark
- Advertisement -