- Advertisement -
హైదరాబాద్: దసరా వరకు రైతు వేదికలు అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. లాభదాయక పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, అన్నదాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ సోనాతో పంట రాబడి ఎక్కువగా ఉంటుందని, 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగువుతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రతి రైతు పండించిన పంటను రికార్డు చేస్తున్నామని, తెలంగాణలో కోటి 31 లక్షల 50 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, పప్పుధాన్యాల పంటలను మరింతగా ప్రోత్సహిస్తున్నామన్నారు.
- Advertisement -