- Advertisement -
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో వైద్యులు నిర్విరామంగా పని చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. సెలవులు పెట్టకుండా పని చేసిన డా. రాజారావు, డా. ప్రభాకర్ రెడ్డిలకు మంత్రి అభినందనలు తెలిపారు. హెల్త్ వర్కర్ల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. కరోనా సమయంలో కూడా ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి పని చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం అన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చామని, ఉచితంగా పిపిఇ కిట్లు, ఆక్సిజన్ బెడ్ల ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు.
- Advertisement -