హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలోని మియాపూర్ లో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యపై కర్రతో దాడి చేస్తుండగా కూతురు తాకడంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడవయ్య దుర్గమ్మ దంపతులకు సునీత (4), మరో చిన్నారి ఉంది. గురువారం రాత్రి దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో దుర్గమ్మ ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి బయలుదేరుతుండగా అడవయ్య అడ్డుకున్నాడు. ఈక్రమంలో అడవయ్య దుర్గమ్మను కర్రతో కొట్టే క్రమంలో అదుపుతప్పి చిన్నారి సునీత మెడ, ఛాతీపై బలమైన దెబ్బ తగిలింది. వెంటనే చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు పరీక్షించి చిన్నారి చనిపోయిందని చెప్పడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కోపానికి కూతురు బలైందని బంధువులు, స్థానికులు వాపోతున్నారు.