- Advertisement -
కోల్కతా: ఓ టీచర్ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను భర్త హత్య చేసిన సంఘటన పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాంతి అనే మహిళ స్థానిక స్కూల్ టీచర్గా పని చేసేది. స్థానికంగా ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడిపేది. లాక్డౌన్ నేపథ్యంలో స్కూల్ మూతపడడంతో ఆమె ఇంటి వద్దనే ఉండేది. ఉద్యోగం నిమిత్తం భర్త కోల్కతా వెళ్లి వచ్చేవాడు. భర్త ఇంట్లో లేకపోవడంతో ప్రియుడితో కలిసి రాసలీలలు కొనసాగించేది. ఒక సారి భర్త వచ్చేవరకు ప్రియుడితో కలిసి భార్య నగ్నంగా ఉండడంతో కోపంతో రగిలిపోయిన అతడు రాడ్ తీసుకొని విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. వెంటనే భర్త స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్యను చంపానని లొంగిపోయాడు.
- Advertisement -