Tuesday, April 30, 2024

ఎపిలో మరో 7,228 కేసులు..

- Advertisement -
- Advertisement -

7228 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,838మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 7,738 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 45మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,46,530కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,506మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 70,857మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,291మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 5,70,667మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 53,02,367మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

7228 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News