బెంగళూరు: దెయ్యం పట్టిందని మూడేళ్ల బాలికను బాబా పలుమార్లు కొట్టడంతో చిన్నారి చనిపోయిన సంఘటన కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. అజ్జిక్యాతాన్హల్లి గ్రామ శివారులో ఓ రాకేశ్ (19), పురుషోత్తం(21) అనే వ్యక్తులు దెయ్యలు వదలగొడుతామని బాబాల వేషం వేశారు. ఎవరికైనా కలలు, పిచ్చిగా మాట్లాడితే మంత్రాలు జపించి దెయ్యాలను వదలగొడుతామని స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించారు. ప్రవీణ్ కు మూడేళ్ల కూతురు ఉంది. పాప ప్రతి రోజు రాత్రి కలవరిస్తూ.. నిద్రలో లేచి ఏడుస్తూ ఉండడంతో రాకేశ్ అనే బాబాకు వద్దకు తండ్రి తీసుకొచ్చాడు. రాకేష్ బాబా ఆ బాలికను గంటకు పైగా బాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గంట తరువాత బాలిక అపస్మారకస్థితిలో నుంచి బయటకు వస్తుందని నమ్మబలికారు. బాలిక గంట తరువాత స్పృహలోకి రాకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయిందని తెలిపారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు చిక్కజాజూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో తప్పించుకున్న ఇద్దరు బాబాలను ఘటనా స్థలం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో అరెస్టు చేశారు. బాబాలపై ఐపిసి 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.