సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒక బక్కాయనపై (సిఎం కెసిఆర్)పై ఇంతమంది ‘కాషాయ బాహుబలులు దాడి చేయడమా ? ఇవి రాష్ట్ర ఎన్నికలు కాదు. హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే. చిన్నపాముయినా పెద్దకర్రతో కొట్టాలన్న నానుడిని అక్షరాలా బిజెపి పార్టీ అనుసరిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. నిన్న కోవిడ్ సెంటిమెంట్, ఈరోజు రెలిజియస్ సెంటిమెంట్స్ను అనైతిక రాజకీయ విన్యాసాలతో దేశప్రధాని మోదీజీ, హోం మినిస్టర్ అమిత్ షా బరితెగించారంటే లౌకిక నీతి సూత్రాలను వెక్కిరించడమే గదా అంటూ ఆయన దుయ్యబట్టారు. ఒకవైపు కోట్లాది రైతాంగం అగ్గిపై నుంచొని ప్రాణాలకు తెగించి బార్కెడ్లను, మహమ్మారి కరోనాను లెక్కచేయకుండా ఢిల్లీ రాజధానిలో ధర్నాకు దిగిందని. వారికి సమాధానం చెప్పలేని మోదీ ప్రభుత్వం నేలవిడచి సాముచేస్తూ హైదరాబాద్ రాజకీయ వలసబాట పట్టిందన్నారు. ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైదరాబాద్లో వెతుక్కుంటున్న బిజెపి పార్టీకి హైదరాబాద్ ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని నారాయణ విమర్శించారు.