- Advertisement -
వైద్య, జీవ శాస్త్ర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ పై ఆకాంక్ష
న్యూఢిల్లీ : ప్రపంచానికి ఔషధ శాలగా భారత కీలక పాత్ర వహిస్తోందని, కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వైద్య, జీవ శాస్త్ర రంగాల్లో రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల విస్తరణపై దృష్టి కేంద్రీకరించడమౌతుందని స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్ వెల్లడించారు. ఇండో పసిఫిక్ రీజియన్లో భారత్ పాత్ర పెరుగుతోందని, ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాల వైఖరి దృఢంగా ఉందని, స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్పప్పటికీ అంచనాలకు అనుగుణంగా ఇవి త్వరలో మెరుగుపడుతుందని, రెండు దేశాలు పరస్పర ప్రయోజనం పొందగలవన్న ఆశాభావం వెలిబుచ్చారు.
- Advertisement -