న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్లు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలు, వ్యవసాయ చట్టాలపై చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రం రైతులతో జరిగిన రెండు దఫాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని నివాసంలో ఇవాళ కేంద్ర మంత్రులు భేటీ అయినట్టు తెలుస్తోంది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. రైత ఆందోళనలకు మద్దతు పెరగడంతో ఢిల్లీ సరిహద్దుల్లోని దారులన్నీ మూసివేశారు. కేంద్రం తక్షణమే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Union Ministers Meet PM Narendra Modi