- Advertisement -
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే 23 లక్షలమందికి టీకాలు ఇచ్చారని, వ్యాక్సినేషన్ను ప్రారంభించిన చైనా, అమెరికా, యుకె, రష్యా దేశాల జాబితాను రాహుల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత్ ఇంకా ఎప్పుడు ఆ జాబితాలో చేరుతుందని ఆయన ప్రశ్నించారు. భారత్లో అత్యవసర వినియోగానికి డిసిజిఐకి ఫైజర్, భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి.
- Advertisement -