Monday, May 20, 2024

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Two Died in Road Accident in Medak District

సిద్దిపేట: కొండపాక మండల పరిధిలోని రవీంద్రనగర్ గ్రామ శివారులో రాజీవ్హ్రదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కుకునూర్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన పెద్దోజి రమేశ్(28) ఎలక్ట్రిషన్ వర్క్ చేసుకుంటూ.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా కమలాపూర్‌కు చెందిన కానుగుల సాగర్(28) సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. హైదరాబాద్ వారసిగూడలో ఉంటున్నారు. వీరిద్దరూ వరసకు బావ, బావమరుదులు, వీరిద్దనూ కలిసి శనివారం కరీంనగర్‌లో ఎలక్ట్రిషన్ పనిచేసి మోటర్ సైకిల్‌పై తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు.

ఈ క్రమంలో కొండపాక మండలం రవీంద్రనగర్‌కు చేరుకోగానే.. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ వారిద్దరిపై నుంచి వెళ్లి దీంతో తీవ్రగాయాలపాలై కానుగుల సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దోజి రమేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో టోల్‌ప్లాజా అంబులెన్స్ సిబ్బంది . సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సాగర్ తండ్రి రవీంద్రచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాయిరామ్ తెలిపారు. అనంతరం మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News