Wednesday, May 1, 2024

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి… పెట్రోల్ పోసి తగలబెట్టారు…

- Advertisement -
- Advertisement -

Petrol pouring on biker in Rangareddy

హైదరాబాద్: లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో జరిగింది. బాధితుడు 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జిల్లెల గూడ చెందిన హరీష్ అనే వ్యక్తి(28) ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఎల్‌బి నగర్‌లో సెకండ్ సినిమా చూసి తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. చాంద్రాయణగుట్టలో పని ఉందని అక్కడి దించాలని హరీష్ ను లిఫ్ట్ అడిగిన వ్యక్తి కోరడంతో అక్కడ దించాడు. జిల్లెలగూడకు తిరిగి వస్తుండగా మరో వ్యక్తి లిఫ్ట్ అడగడంతో బైక్‌పై ఎక్కించుకొని బాలాపూర్ వైపు వెళ్లాడు. తన బంధువు సీరియస్‌గా ఉందని సూల్తాన్‌పూర్ వరకు రావాలని విజ్ఞప్తి చేశాడు. అక్కడికి చేరుకోగానే మరో బైక్‌పై ముగ్గురు వ్యక్తులు మాస్క్‌లు వేసుకొని హరీష్‌పై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ భాస్కర్, ఎస్ఐ నాగరాజు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News