- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వందలలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 152 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 2.94 లక్షలకు చేరుకోగా 1602 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.91 లక్షల మంది కోలుకోగా 2022 మంది చికిత్స తీసుకుంటున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 17 వేల మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 78.8 లక్షలకు చేరుకుంది. కరోనా కేసుల సంఖ్యలో తొలి స్థానంలో మహారాష్ట్ర(20.28 లక్షలు), రెండో స్థానం కర్నాటక(9.39 లక్షలు), మూడో స్థానం కేరళ (9.32 లక్షలు), నాలుగో స్థానం ఆంధ్రప్రదేశ్(8.87 లక్షలు), 12వ స్థానంలో తెలంగాణ ఉంది.
- Advertisement -