- Advertisement -
ఢిల్లీ: భారత దేశంలో గత కొన్ని రోజుల నుంచి పది వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,635 కరోనా కేసులు నమోదుకాగా 94 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.07 కోట్లకు చేరుకోగా 1.54 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.04 కోట్ల మంది కోలుకోగా 1.63 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 6.59 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 19.77 కోట్ల మంది కరోనా టెస్టులు చేసశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల విషయంలో అమెరికా (2.69 కోట్లు) తొలి స్థానంలో ఉండగా వరసగా భారత్ (1.07 కోట్లు), బ్రెజిల్ (92.3 లక్షలు), రష్యా (38.68 లక్షలు) ఉన్నాయి. పాకిస్థాన్ (5.47 లక్షలు) 30వ స్థానం, చైనా (89 వేలు) మాత్రం 83వ స్థానంలో ఉంది.
- Advertisement -