Tuesday, April 30, 2024

కెసిఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం….

- Advertisement -
- Advertisement -

CM KCR visit yadadri temple

యాదాద్రి: సిఎం కెసిఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సిఎం కెసిఆర్ రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణంపై అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్షలు జరపనున్నారు. ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. ఇండోర్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూలైన్ల స్తంభాలను పరిశీలించారు. బంగారు వర్ణంలో ఉన్న స్తంభాలపై శంకు చక్రాలు, గోవింద నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News