Tuesday, April 30, 2024

ఇంగ్లాండ్ 101/4

- Advertisement -
- Advertisement -

England scored 101 runs for 4 wickets

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ 40 ఓవర్ల నాలుగు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అక్షర పటేల్ స్పిన్ మాయజాలంలో ఓపెనర్లు ఔటయ్యారు. ఇంగ్లాండ్ జట్లు 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జోయ్ రూట్ ఐదు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో మైదానం వీడాడు. జానీ బైయిర్ స్టో 28 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్(40), ఓలీ పోప్(09) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో అక్షర పటేల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం ఈ సిరీస్ భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News