కొత్తగా మరో 181 మందికి వైరస్
జిహెచ్ఎంసి పరిధిలో44, జిల్లాల్లో 137 పాజిటివ్లు
3,00,717కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 91 లక్షలు దాటింది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల 14 వేల 985 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల్లో 2,44,894 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. ఇదిలా ఉండగా కొత్తగా మరో 181 మందికి పాజిటివ్ తేలింది.
వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 44, ఆదిలాబాద్లో 9, భద్రాద్రి 6, జగిత్యాల 6, జనగాం 5, భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 10,ఖమ్మం 2, ఆసిఫాబాద్ 0, మహబూబ్నగర్ 3, మహబూబాబాద్ 2, మంచిర్యాల 5, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్గిరి 15, ములుగు 0, నాగర్కర్నూల్ 2, నల్గొండ 5, నారాయణపేట్ 1, నిర్మల్ 0, నిజామాబాద్ 10, పెద్దపల్లి 2, సిరిసిల్లా 3, రంగారెడ్డి 19, సంగారెడ్డి 9, సిద్ధిపేట 2, సూర్యాపేట్ 1,వికారాబాద్ 4, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ లో 8 మందికి వైరస్ సోకింది.
అదే విధంగా వైరస్ దాడిలో మరోకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,00,717కి చేరగా, డిశ్చార్జ్ల సంఖ్య 2,97,195 కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్లో 44 కేంద్రాల్లో ఆర్టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు