- Advertisement -
చెన్నై: మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తనను, తన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను తన తండ్రి ఓ ఐఎఎస్ అధికారిని చేయాలని, ఆ తర్వాత ఓ రాజకీయవేత్తగా చూడాలని కలలుకన్నారు. ఇప్పుడు తన పార్టీలో పలువురు మాజీ ఐఎఎస్లు చేరడం గర్వంగా ఉన్నదని కమల్ అన్నారు.
- Advertisement -