Monday, May 20, 2024

ద్వేషం స్థానంలో శాంతిని తెస్తాం

- Advertisement -
- Advertisement -

Congress will eliminate hatred, bring peace in Assam

 

అసోం ప్రజలకు రాహుల్ భరోసా

మరియానీ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ద్వేషాన్ని తొలగించి, శాంతిని నెలకొలుపుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. శనివారం అసోం జోర్‌హత్ జిల్లాలోని మరియానీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. అసోం సంస్కృతి, భాష, చరిత్ర, సౌభ్రాతృత్వంపై బిజెపి దాడి జరుపుతోందని రాహుల్ విమర్శించారు. మీ రాష్ట్రాన్ని మీరే పాలించుకోవాలని, నాగపూర్ నుంచి కాదని రాహుల్ అన్నారు. మీ రాష్ట్రాన్ని బయటివారికి బిజెపి అప్పజెబుతోందని ఆయన ఆరోపించారు. మీ డబ్బులు రూ.2000 కోట్లతో గౌహతి విమానాశ్రయాన్ని ప్రభుత్వం ఆధునీకరించింది. దాన్నిపుడు అదానీకి ఇచ్చింది. దేశంలోని ప్రతిదీ మోడీ తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు అప్పజెబుతున్నారని రాహుల్ విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News