Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

young man killed in road accident at medchal

దుండిగల్: మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని దుండిగల్ పరిధి గండిమైసమ్మ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ అదుపుతప్పి పడడంతో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో వంశీ(25) అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. మృతుడిని అభినవ్ (24)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగంతో భైక్ నడపడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

young man killed in road accident at medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News