- Advertisement -
కొత్తకోట: వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం కడుకుంట్ల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్రాలీ ఆటో లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను అనంతపురం జిల్లా పుట్టపర్తి వాసులుగా గుర్తించారు.
two killed in road accident at wanaparthy
- Advertisement -