- Advertisement -
హైదరాబాద్: ఓ తల్లి తన కన్నకుమార్తెను రూ. 3 వేలకు విక్రయించిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి మండలంలో చోటుచేసుకుంది. మూడ్రోజుల క్రితం శాంతమ్మ అనే మహిళకు 7 రోజుల శిశువును తల్లి (రాధ) మూడు వేలకు అమ్మేసింది. కాగా, రాధ, శాంతమ్మ బాచుపల్లి వద్ద గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. రాధ తన బిడ్డను తిరిగివ్వాలని గురువారం శాంతమ్మ ఇంటికెళ్లి అడిగింది. రూ.10 వేలు ఇస్తే శిశువును తిరిగి ఇస్తానని శాంతమ్మ తేల్చిచెప్పింది. దీంతో ఆమె శిశువు విక్రయ విషయాన్ని అంగన్ వాడీలకు చెప్పింది. అంగన్ వాడీల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిశువును బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శిశువును శిశువిహార్ కు తరలిస్తామని బాచుపల్లి పోలీసులు వెల్లడించారు.
Mother Sold her Daughter in Bachupally
- Advertisement -