Tuesday, May 21, 2024

సోనూ సేవలు గొప్పవి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తన సేవా కార్యక్రమాలతో మొత్తం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ మంగళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావును ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కెటిఆర్ అభినందించారు. సోనుసూద్ అందచేస్తున్న చేయూత మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కెటిఆర్ కితాబునిచ్చారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో పాటు సేవా రంగంలో తన భవిష్యత్ ప్రణాళికలను మంత్రి కెటిఆర్‌తో పంచుకున్నారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కెటిఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ పేర్కొన్నారు. ఈ సమావేశానంతరం మంత్రి కెటిఆర్, సోనూసూద్‌కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి ఒక మెమొంటోను సోనూసూద్‌కు మంత్రి కెటిఆర్ అందజేశారు.

Sonu Sood Meets Minister KTR At Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News