Tuesday, April 30, 2024

మిరుదొడ్డిలో దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: భార్యభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆ దంపతులు ఉరేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధర్మారం గ్రామంలో దేవరాజు(30), మమత(26) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మోక్షవర్ధన్, మనస్విత్ అనే పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవల నేపథ్యంలో పెద్దల మనుషులు పలుమార్లు దంపతులకు సర్దిజెప్పి కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. దేవరాజు కుటుంబ తన తల్లిదండ్రులతో కలిసి మోతె గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. పిల్లలను అక్కడే వదిలేసి దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. దంపతులు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇద్దరు ఉరేసుకున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు సిఐ హరికృష్ణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దంపతుల మృతితో కుమారులు ఒంటరిగా మిగిలిపోయారు. ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News