Sunday, May 5, 2024

డబ్బుల కోసం తండ్రిని 23 సార్లు పొడిచిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

23 times stabbed father by son in up

మీరట్: భూమి అమ్మగా వచ్చిన డబ్బులలో తన వాటా ఇవ్వలేదని 70 ఏళ్ల వృద్ధుడిని అతడి చిన్న కుమారుడు 23సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయ్ పాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులతో కలిసి దౌరాల ప్రాంతంలో నివసిస్తున్నారు. విజయ్ తన పేరు మీద ఉన్న 15 లక్షల రూపాయల విలువగల భూమిని అమ్మేశాడు. చిన్న కుమారుడు అభిశాంత్ తన వాటా డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. కుమారుడికి తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో కత్తి తీసుకొని 23 సార్లు పొడవడంతో తండ్రి చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి వృద్ధుడి మృతదేహం టెర్రస్ పై ఉంది. వృద్ధుడి చేయి, కాలు మృతదేహానికి కొద్దీ దూరంలో ఉన్నాయి. దుండగులు ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేయడంతో స్పృహ కోల్పోయానని, లేచి చూసేసరికి తండ్రి రక్తపు మడుగులో కనిపించాడని కట్టు కథ పోలీసులకు వినిపించారు. కుమారుడిపై దాడి చేసిన ఆనవాళ్లు లేకపోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. చిన్న కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News