Friday, May 3, 2024

దేశంలో కొత్త కరోనా కేసులు 27 వేలు.. 284 మంది మృతి

- Advertisement -
- Advertisement -

27 thousand new corona cases in India

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరుకుంది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,43,497 మంది బాధితులు మృతిచెందారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని స్పష్టంచేసింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 54,60,55,796 నమూనాలకు పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,10,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News