Sunday, April 28, 2024

భార్య మృతి… భర్త పరారీలో

- Advertisement -
- Advertisement -

Wife dead with suspicious in Medchal

మేడ్చల్: ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కూషాయిగూడ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజీవ్‌నగర్ కాలనీలో లక్ష్మీ అనే మహిళను పరుశురామ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దంపతుల తాగుడు బానిస కావడంతో ఇద్దరు ప్రతీ రోజు గొడవపడేవారు. లక్ష్మీ మృతదేహం కనిపించడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. లక్ష్మీ ముఖం, మెడపై గాయాలు ఉండడంతో భర్త చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరుశురామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News