Tuesday, April 30, 2024

అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తా: గెల్లు

- Advertisement -
- Advertisement -

తనని ఆశీర్వదించండి అందుబాటులో ఉండి సేవ చేస్తా: గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్: మూడు కోట్ల నిధులతో ఇప్పల నర్సింగాపూర్ సిసి రోడ్డు పనులు కొనసాగుతున్నాయిని టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. జిల్లా మంత్రి గంగుల సహకారంతో ముఖ్యమంత్రి నిధుల్ని విడుదల చేశారని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా గెల్లు మీడియాతో మాట్లాడారు. బోర్నపల్లి నుంచి ఎల్లమ్మ గుడి వరకు కోటీ ముప్పై లక్షలతో రోడ్డు పనులు జరుగుతున్నాయని, ముదిరాజు భవన్, ఎస్సిభవన్, బీరయ్య గుడి కోసం ఒక్కోదానికి పదిహేను లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. చిలుకవాగు బ్రిడ్జి, మహిళా సంఘం భవనం కోసం ఒక్కోదానికి ఇరవై లక్షల నిధుల్ని కెసిఆర్ మంజూరు చేసి పనులు చేస్తున్నారన్నారు. 17 ఏళ్లు ఎంఎల్ఎగా ఏడున్నరేళ్లు మంత్రిగా పని చేసిన ఈటెల ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిర్లక్ష్యంతో వెనుకబడ్డ అభివృద్ధిని స్థానిక నేతల సహకారంతో పూర్తి చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చేస్తున్న, రాబోయే రోజుల్లో పనులు చేసే టిఆర్ఎస్ పార్టీ తరపున నిలబడ్డ తనని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మంత్రులు కమలాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు, స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News