Saturday, April 27, 2024

 చైతన్యం చాటిన హుజూరాబాద్ ఓటర్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ మార్గదర్శకత్వం, హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో గోప్ప విజయం సాధించ బోతున్నాం…

ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు.. కష్టపడ్డ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు..

Thanks for Huzurabad Voters

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యాన్ని చాటారు అని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత 4 నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మార్గదర్శకంలో హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబోతున్నామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News