Thursday, May 9, 2024

మహా పాదయాత్రకు అనుమతి: డిజిపి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతుల మహా పాదయాత్రకు డిజిపి సవాంగ్‌ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డిజిపి అనుమతి ఇచ్చారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డిజె సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని డిజిపి ఆదేశించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని డిజిపి షరతు విధించారు. ప్రతి రోజు ఉదయం.6 గంటల నుంచి సాయంత్రం.6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డిజిపి సవాంగ్‌ ఆదేశించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News