- Advertisement -
మెక్సికో: మెక్సికోలోని తులుమ్ పట్టణంలో డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మహిళలు చనిపోయారు. వారిలో ఒకరు భారతీయురాలు కాగా,ఇంకొకరు జర్మనీ మహిళ, మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు జర్మనీకి, ఒకరు నెదర్ల్యాండ్కు చెందినవారు. బుధవారం రాత్రి ఓ రెస్టారెంట్ వద్ద రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో వీరు చనిపోయారు. తీర పట్టణమైన తులుమ్కు విదేశీ పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అయితే, అక్కడి డ్రగ్స్ ముఠాల మధ్య అప్పుడప్పుడూ జరిగే కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు చనిపోగా, ఒకరు గాయపడ్డారు.
- Advertisement -