- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,392 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 186 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,70,829కు పెరిగింది. తాజాగా 122 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,62,714 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,951కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.79 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,164 యాక్టివ్ కేసులున్నాయి.
- Advertisement -