- Advertisement -
మన తెలంగాణ/ గద్వాల ప్రతినిధి: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 6 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ధరూర్ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. ధరూర్ మండలం చింతరేవుల గ్రామానికి చెందిన అనిల్, అనురాధ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తన బొలేరో వాహనాన్ని తీసేక్రమంలో ప్రమాదవశాత్తు ఇంటిముందర ఉన్న అభిరామ్ (6) మీదుగా బొలేరో వాహనం వెళ్లడంతో సంఘటన స్థలంలోనే బాలుడు మృతి చెందాడు. కొడుకు చనిపోయిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.
- Advertisement -