Sunday, May 5, 2024

రాబరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for committing robberies

హైదరాబాద్ : దారిన పోతున్న వారిపై దాడి చేసి దోపిడీలు చేస్తున్న ఇద్దరు నిందితులను చత్రినాక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.3,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని ఉప్పుగూడ, శివాజి నగర్‌కు చెందిన ఎండి ఖదర్ మోయినుద్దిన్ ఆయుబ్ అలియాస్ ఆయుబ్ సోఫా మరమ్మతు చేస్తున్నాడు. అరుంధతి కాలనీకి చెందిన బురుపల్లి చంద్రశేఖర్ బ్యాండ్ వర్కర్. కర్నాటక రాష్ట్రం, బీదర్‌కు చెందిన చిన్నురా దిగంబర్ ఉప్పుగూడ, శివసాయినగర్‌లో ఉంటూ ఫేమస్ టిఫిన్ సెంటర్‌లో కుక్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నెల 19వ తేదీ ఉదయం 5గంటలకు దిగంబర్ విధులకు వెళ్తుండగా ఇద్దరు నిందితులు అడ్డుకున్నారు. నడుచుకుంటూ వస్తుండగా ఇంజిన్ బౌలి వద్ద అడ్గుకున్నారు. తమకు టీ తాగేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఒకరు గట్టిగా పట్టుకోగా ఇద్దరు కలిసి కొట్టారు. తర్వాత మొబైల్ ఫోన్, రూ.3,900 నగదును చోరీ చేశారు. వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు విషయం ఇంటి యజమానికి చెప్పాడు. వెంటనే ఇద్దరు కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎస్‌ఎకె జిలానీ, డిఎస్సై రమేష్, పిసిలు రాజు, సుధీర్‌కుమార్ తదితరులు దర్యాప్తు చేసి అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News