Saturday, May 4, 2024

కేరళలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -

Four more Omicron cases in Kerala

 

తిరువనంతపురం : కేరళలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు సోమవారం బయటపడ్డాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 15 కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నాలుగు కేసుల్లో రెండు 41,67 ఏళ్ల రోగులవి. వీరిద్దరూ తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల రోగికి తల్లి, అమ్మమ్మలు అవుతారు. ఆ 17 ఏళ్ల రోగి తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి డిసెంబర్ 9 న బ్రిటన్ నుంచి ఇక్కడకు వచ్చాడు. అతని అమ్మమ్మ కాంటాక్టు జాబితాలో ఉంది. మరో రెండు కేసులు తిరువనంతపురం నుంచి బయటపడ్డాయి. వీరిలో ఒకరు 32 ఏళ్ల వ్యక్తి. డిసెంబర్ 17 న నైజీరియా నుంచి వచ్చాడు. మరో కేసు 27 ఏళ్ల యువతి. ఆమె డిసెంబర్ 12న బ్రిటన్ నుంచి వచ్చారు. విమాన ప్రయాణికుల కాంటాక్టు జాబితాలో ఆమె ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News