Saturday, June 21, 2025

తొలి టెస్ట్ మ్యాచ్‌లో జైస్వాల్ అర్థశతకం

- Advertisement -
- Advertisement -

లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal), కెఎల్ రాహుల్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. తొలి వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కార్సే బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి రాహుల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి సాయి సుదర్శన్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు. దీంతో భోజన విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

ఆ తర్వాత రెండో సెషన్ ఆరంభం కాగానే.. బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి.. జైస్వాల్ (Yashaswi Jaiswal) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 96 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం 39 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజ్‌లో జైస్వాల్ (67), శుభ్‌మాన్ గిల్ (40) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో కార్సే, స్టోక్స్ తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News