Friday, September 26, 2025

ఒఆర్ఆర్ పై ట్రాలీ వాహనం ఢీకొని ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కీసర వద్ద ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒఆర్ఆర్ కీసర ఎగ్టిట్ వద్ద ట్రాలీ వాహనం ముగ్గురు కార్మికులను ఢీకొంది. కూలి పనిచేస్తూ రోడ్డు దాటుతుండగా ముగ్గురిని ట్రాలీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన కార్మికులు ఒడిశాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News