- Advertisement -
డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44 వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టిన తర్వాత డివైడర్ పైకి ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ సకనమాదం పది మంది గాయడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యూ-టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read : దసరా కానుకగా ‘పెద్ది’ సాంగ్?
- Advertisement -