Sunday, April 28, 2024

నిర్మాణ రంగంలో ఉపాధికి ఊతం

- Advertisement -
- Advertisement -
  • మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో వృత్తి నైపుణ్య కేంద్రం
  • రూ. 10 కోట్లతో న్యాక్ భవనం నిర్మాణం
  • న్యాక్ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: నిర్మాణ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆసక్తి చూపే ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు మంత్రి హరీశ్‌రావు తీపి కబురు చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా నిర్మాణ రంగ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ బందుగా మారారు. వృత్తి నైపుణ్యం కోసం హైదరాబాదులో ఉన్న న్యాక్ నిర్మాణ రంగంలో మెళుకువలు జాతీయ శిక్షణ కేంద్రం అనుబంధంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఇప్పటికే న్యాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాణ రంగంలో ఆపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఇందుకోసం యువతి శిక్షణ కోసం హైదరాబాద్‌లోని హైటెక్ సీటిలో ఉన్న న్యాక్ వరకు వెళ్లకుండా సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం ఊరట కలిగించిన ఆంశం.

శిక్షణ కేంద్రం ఏర్పాటు పై ప్రత్యేక శ్రద్ధ చూపిన మంత్రి హరీశ్‌రావు ఇందుకు అవసరమైన వృత్తి నైపుణ్య కేంద్ర నిర్మాణం కోసం ఇటీవలే రూ.10 కోట్లు నిధులతు మంజూరు చేశారు. నేడు న్యాక్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.జీప్లస్ 2గా దీని నిర్మాణం జరగనుంది. గ్రౌండ్ ప్లోర్‌లో వాల్, ఫస్ట్ ప్లోర్‌లో డ్రైనింగ్ హాల్, టాయిలెట్స్, రెండత అంతస్థులో క్లాస్ రూమ్స్, శిక్షణార్థులకు వసతి గృహం ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే మోడల్ గా న్యాక్ భవనం నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా నిర్మాణ రంగ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు. ఈ భవనం పూర్తి అవుతే నేషనల్ ఆకాడమీ ఆప్ కన్స్రక్షన్స్ న్యాక్ సెంటరులో లార్సన్ అండ్ టూబ్రో ఎల్ అండ్ టీ సంస్థ ప్రతియేటా 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News