Wednesday, May 8, 2024

నీటి బకెట్‌లో పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి : నీటి బకెట్‌లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య, రేణుక దంపతులకు సంవత్సరం బాలుడు ఉన్నాడు. రోజు మాదిరిగానే సోమవారం బాలుడు ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందాడని తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News