Tuesday, April 30, 2024

అంబులెన్స్ లేదనడంతో తోపుడుబండిపై భార్య శవాన్ని తీసుకువెళ్లిన భర్త

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రులలో అంబులెన్సులు ఉండవు, ఉన్నా అందరికీ ఇవ్వరు. ఇలాంటిదే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. గుండెపోటుతో మరణించిన తన భార్య మృతదేహాన్ని ఊరికి తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఆ పేదవాడు తోపుడు బండిపై తీసుకువెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆస్పత్రి అధికారులు లబోదిబోమంటున్నారు.

అస్రౌలీ గ్రామానికి చెందిన వేదరామ్ తన భార్యకు గుండెపోటు రావడంతో ఫిరోజాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. భార్య శవాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వమని వేదరామ్ ప్రాధేయపడినా సిబ్బంది నిరాకరించారు. తన ఊరు పొరుగు జిల్లాలో ఉందన్న నెపంతో అంబులెన్స్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారని వేదరామ్ చెప్పాడు. దాంతో బంధువుల సహకారంతో భార్య శవాన్ని తోపుడు బండిపై ఉంచి ఇంటికి బయల్దేరాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సంఘటనపై విచారణకు ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News