Tuesday, May 7, 2024

‘మీ కోసం- మీ ఎమ్మెల్యే’లో భాగంగా కాలనీల్లో పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజ న్ పరిధిలోని వంపుగూడ, ఎల్లారెడ్డిగూడ, దుర్గానగర్, సూర్యనగర్, ఓల్డ్ కాప్రా, యాదవ బస్తీ తదితర కాలనీల్లో అధికారులు కాలనీవాసులతో కలసి మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో సుభాష్‌రెడ్డి పాదయాత్ర చే శా రు. ప్రతి ఇంటి వద్ద అగి సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరిష్కరించారు.

ముఖ్యంగా వంపుగూడ కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాల ని, సీసీ రోడ్డు నిర్మాణం, గౌరినాథ్‌పురం నుంచి ఎన్‌అర్‌ఐ కాలనీ వరకు డ్రైనేజీ నిర్మాణం, మురికి కాలువ వ్యర్ధల తొలగింపు, వంగిపోయిన విద్యుత్ స్ధంబాల ను ఆధునీకరించాలని వీధి దీపాల ఏర్పాటు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మార్ ను తరలించి కంటే ఏర్పాటు చేయడం, పద్మారావునగర్‌లో సిసి కెమెరాల ఏ ర్పాటు, పారిశుద్ధ నిర్వహణ పింఛన్లు వంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి కాలనీ వాసులు తీసుకువచ్చారు. శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి ఆలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే ప రిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ ల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కరం కోసమే కాలనీల్లో పాదయాత్ర చేస్తున్ననని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా, మీర్‌పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్లు స్వర్ణరాజు, జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి దన్‌పాల్ రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, కాప్రా పార్టీ డివిజన్‌అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, గిల్‌బర్ట్ ఉప్పల్ నియోజకవర్గంలోని పది డివిజన్లకు చెందిన బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News