Sunday, April 28, 2024

సంక్రాంతి కానుకగా ‘నా సామిరంగ’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కింగ్ నాగార్జున అక్కినేని పుట్టినరోజు సందర్భంగా అభిమానులను ఆనందపరిచే విధంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. పలు ప్రముఖ చిత్రాలకు పనిచేసిన పాపులర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని మాస్ జాతరగా రూపొందుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మరో బిగ్ సర్‌ప్రైజ్‌గా మేకర్స్ ఒక గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘నా సామిరంగ’ అనే క్యాచీ టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏఎన్‌ఆర్ కల్ట్ హిట్ ‘సిపాయి చిన్నయ్య’ లోని నా సామి రంగ అనే ఐకానిక్ సాంగ్. నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో మాస్ అవతార్‌లో కనిపించారు.

టైటిల్ గ్లింప్స్ ‘నా సామి రంగ’ వరల్డ్‌ని మనకు పరిచయం చేస్తుంది. పలాస ఫేమ్ కరుణ కుమార్, అతని గూండాల బ్యాచ్ హీరోని చంపడానికి చూస్తున్నప్పుడు.. సింబాలిక్‌గా కింగ్‌గా పరిచయం అవుతారు. ఇక నాగార్జున ఎంట్రీతో అసలు మాస్ జాతర మొదలవుతుంది. అతని పేరు వినగానే ప్రత్యర్థులు వణుకుతున్నప్పుడు అతను వారిపై దాడి చేయడం మొదలుపెడతాడు. నాగార్జున మాస్ లుక్, ఎక్స్‌ట్రార్డీనరీ స్క్రీన్ ప్రెజెన్స్ సీక్వెన్స్‌కు బలాన్ని తెచ్చింది. విజువల్స్ అత్యుత్తమంగా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. నాగార్జునకు అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించి ఆస్కార్, జాతీయ అవార్డును గెలుచుకున్న లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. బ్లాక్‌బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించారు. మేకర్స్ మరో సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

‘డి51’లో చేరిన కింగ్…
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో పవర్ ప్యాక్డ్ రోల్‌లో కింగ్ నాగార్జున అక్కినేని జాయిన్ అయ్యారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మంగళవారం ఈ ప్రకటన చేశారు. ఇద్దరి స్టార్స్ అభిమానులు వారి స్క్రీన్ పై చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి(ఏషియన్ గ్రూప్) బ్యానర్‌లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News