Sunday, May 5, 2024

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న అమిత్ తివారి..

- Advertisement -
- Advertisement -

 Actor Amit Tiwari plant saplings in Jubilee Hills

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో సినీ నటుడు అమిత్ తివారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడం గర్వంగా ఉందని అన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అమిత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తన స్నేహితులు కాలకేయ ప్రభాకర్, కిరీటి దామరాజు, రాఘవకు అమిత్ తివారి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరారు.

 Actor Amit Tiwari plant saplings in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News