Sunday, April 28, 2024

అదానీ సొంతమైన మరో పోర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) తాజాగా కారైకల్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (కెపిపిఎల్)ని రూ.1,485 కోట్లకు కొనుగోలు చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఆమోదం పొందిన తర్వాత అదానీ పోర్ట్ కెపిపిఎల్ కొనుగోలును పూర్తి చేసింది. అంతకుముందు కెపిపిఎల్ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సిఐఆర్‌పి) కింద అదానీ పోర్ట్ విజయవంతమైన రిజల్యూషన్ దరఖాస్తుదారుగా ప్రకటించింది. కారైకాల్ నౌకాశ్రయం భారతదేశ తూర్పు తీరంలో లోతైన నీటి నౌకాశ్రయం, ఇది పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ఫార్మాట్‌లో పుదుచ్చేరి ప్రభుత్వంచే నిర్మించారు.

కారైకాల్ పోర్ట్ 2009లో ప్రారంభించారు. చెన్నైకి దక్షిణాన దాదాపు 300 కి.మీ దూరంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కారైకాల్ జిల్లాలో అభివృద్ధి చేశారు. ఇది చెన్నై నుంచి టికోరిన్‌ల మధ్య ఉన్న ఏకైక ప్రధాన నౌకాశ్రయం, దీని వ్యూహాత్మక ప్రదేశం మధ్య తమిళనాడులోని పారిశ్రామిక- సంపన్న ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఎపిసెజ్ సిఇఒ, హోల్-టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ, భారతదేశం అతిపెద్ద రవాణా యుటిలిటీగా సంస్థ తన స్థానాన్ని సుస్థిరం చేయడంలో భాగంగా కారైకాల్ పోర్ట్‌ను కొనుగోలు చేయడం మరో మైలురాయి అని అన్నారు. కారైకాల్ పోర్ట్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఇప్పుడు అదానీ పోర్ట్ భారతదేశంలో 14 పోర్టులను నిర్వహిస్తున్న కంపెనీగా మారనుంది.

అదానీ షేర్ బ్లాక్ డీల్‌తో పెరిగిన ఎఫ్‌పిఐ కొనుగోళ్లు

వరుసగా రెండు నెలల పాటు పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) మార్చిలో భారత స్టాక్‌మార్కెట్‌లో రూ.7,936 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అమెరికా ఆధారిత జిక్యూజి భాగస్వాములు అదానీ గ్రూప్ కంపెనీలలో బల్క్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఎఫ్‌పిఐ పెట్టుబడి మార్చిలో సానుకూలంగా ఉంది. జిఎల్‌సి వెల్త్ అడ్వైజర్స్ ఎల్‌ఎల్‌పి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) సంచిత్ గార్గ్ మాట్లాడుతూ, అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడులను మినహాయిస్తే మార్చిలో ఎఫ్‌పిఐల నికర పెట్టుబడి ప్రతికూలంగానే ఉందని అన్నారు.

అంటే మార్చిలో కూడా ఎఫ్‌పిఐలు అమ్మకాలు జరిపారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మాట్లాడుతూ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాల పరంపరకు ముగింపు పలుకుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని సెషన్లలో వారు కొనుగోలుదారులుగా మారారని అన్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్‌లో దిద్దుబాటు విలువలను సాధారణ స్థితికి తీసుకువచ్చిందని విజయకుమార్ అన్నారు. ఎగుమతులు పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటు (సిఎడి) పరిస్థితి మెరుగైందని, ఈ పరిస్థితిలో ఎఫ్‌పిఐలు మరింత దూకుడుగా విక్రయించకపోవచ్చని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News