Wednesday, May 8, 2024

శాసనమండలి చైర్మన్‌ను కలిసిన రాష్ట్ర లెజిస్లేచర్ సలహాదారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర లెజిస్లేచర్ సలహాదారులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రసన్నకుమార్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసన మండలి ప్రాంగణంలోని తన చాంబర్‌లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రసన్న కుమార్ భారత రాజ్యాంగాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డా. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News