- Advertisement -
అయోధ్య: అఫ్ఘానిస్థాన్లోని ఓ అమ్మాయి పంపిన కాబుల్ నది నీరును గంగాజలంతో కలిపి ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అయోధ్యలోని రామజన్మభూమిలో ‘జలాభిషేకం ’ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకే ఆదిత్యనాథ్ ఇలా చేశారని సమాచారం. దీనికి ముందు ఆదిత్యనాథ్ తన అధికారిక నివాస గృహం వద్ద తాను దీపోత్సవం 2021 వేడుకల ప్రిపరేషన్లను సమీక్షించబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన ‘గౌరవనీయ ప్రధాన మంత్రికి అఫ్ఘానిస్థాన్ నుంచి ఓ అమ్మాయి కాబుల్ నది నీరు పంపి, దానిని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో అర్పించాల్సిందిగా కోరింది’ అని తెలిపారు. “ ఆ దృష్ట్యా నేను ఈ ఈవెంట్(దీపోత్సవం)కు ప్రత్యేకించి ఆ సెంటిమెంట్ను జోడించడానికే వచ్చాను” అన్నారు.
- Advertisement -